దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగే అవకాశాలు కనపడటం లేదు. రోజు రోజుకి కూడా కరోనా తీవ్రత పెరుగుతుందే గాని తగ్గడం లేదు. నిన్న ఒక్క రోజే దేశంలో ఆరు వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. 6,147 కొత్త కేసులతో పాటుగా 146 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

 

3,302 మంది ఇప్పటి వరకు కరోనా కారణంగా మరణించగా 42,309 మంది పూర్తిగా కరోనా నుంచి కోలుకుని బయటపడ్డారు. మహారాష్ట్రలో 35 వేలు దాటగా... ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్ లో 11 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. లాక్ డౌన్ ఉన్నా సరే ఈ స్థాయిలో కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.మొత్తం కేసుల సంఖ్య 106,475 కి చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: