అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏది మాట్లాడినా సరే అది సంచలనమే. ఆయన ఏది మాట్లాడినా సరే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వివాదాస్పదం అవుతూనే ఉంది. ఆయన మాట్లాడే మాటలపై అమెరికన్లు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అయినా సరే ఆయన మాత్రం మారడం లేదు అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. ఎప్పుడు ఏది మాట్లాడిన వివాదమే. 

 

తాజాగా ఆయన కరోనా విషయంలో సంచలన వ్యాఖ్య ఒకటి చేసారు. తమ దేశంలో అత్యధిక కేసులు ఉండటం తనకు గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఎక్కువ కేసులు ఉన్నాయి అంటే దాని అర్ధం ఎక్కువ పరిక్షలు చేస్తున్నామని అర్ధమని ఆయన వ్యాఖ్యలు చేయడం మరింత సంచలనంగా మారింది. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు దేశాధినేతలు కూడా విమర్శలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: