ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది . 24 గంటల్లో 68 కేసులు నమోదు అయ్యాయి. గత వారంలో తగ్గిన కేసులు ఇప్పుడు మరింత వేగంగా పెరుగుతున్నాయి. మూడు రోజుల నుంచి 50 కేసులకు పైగా నమోదు అవుతున్నాయి. ఏపీలో 2407 కేసులు నమోదు అయ్యాయి. 

 

1639 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. 53 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 715 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో కొత్తగా నమోదు అయిన కేసుల్లో 10 కోయంబేడు లింకు లు ఉన్నాయి. చిత్తూరు లో ఆరు కేసులకు నెల్లూరు లో 4 కేసులకు కోయంబేడు లింక్ లు ఉన్నాయి. ఏపీలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో కరోనా కేసులు నమోదు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: