విజయవాడ నున్న మ్యాంగో మార్కెట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున సరుకు లోపల ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కృష్ణా, ఉభయగోదావరి ఖమ్మం జిల్లాల నుంచి అక్కడికి మామిడి కాయలను తరలిస్తారు. అతి పెద్ద మార్కెట్ గా నున్నకు పేరు ఉంది. 

 

ఇక అక్కడ ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా భారీగా ఉంటారు. వేసవి తాపాన్ని తట్టుకోవడానికి గానూ తాటాకుల పాకలతో పాటుగా అక్కడ పెద్ద ఎత్తున టార్పాలిన్ లు కూడా ఉంటాయి. అయితే ఇది ఆకతాయిల పని గా పోలీసులు భావిస్తున్నారు. లేక ఎవరు అయినా మార్కెట్ లో ఉన్న వారే నిప్పు పెట్టారా లేక ఏదైనానా అనేది తెలియాల్సి ఉంది. అక్కడి మంటలను అదుపు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: