వైసీపీ అధికారంలోకి వచ్చి ఈ నెల 23వ తేదీకి ఏడాది అవుతున్న కారణంగా ఏడాది పాలనను పండుగలా నిర్వహించుకుందామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ భారీ మెజార్టీతో గెలుపొంది ఈ నెల 23 నాటికి సరిగ్గా ఏడాది అయిందని... ప్రజల ఆశలు-ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజల జీవన ప్రమాణాల్లో కూడా ప్రియతమ ముఖ్యమంత్రి  వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు సమూలమైన మార్పులు తెచ్చారని ఆయన పేర్కొన్నారు. 

 

తొలి సంవత్సరంలోనే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల్లో 90శాతం నెరవేర్చి, ప్రకటించని 40 కొత్త పథకాలు అమలు పరుస్తూ, దేశంలోనే అత్యుత్తమ సీఎంగా, మంచి మనసున్న ముఖ్యమంత్రిగా మన్ననలు పొందారని ఆయన అన్నారు. 23వ తేదీన అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్‌తో పాటు మండల కేంద్రాల్లో పార్టీ జెండాలు ఎగరేయాలి పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: