ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని చర్చకు రమ్మనడం పై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. చంద్రబాబు చర్చకు రమ్మంటున్నారు ఎక్కడికి రావాలని ఆయన ప్రశ్నించారు. మంత్రి అవంతి శ్రీనివాసరావు నేతృత్వం లో కరోనా టాస్క్ ఫోర్స్ భేటి అయింది. 

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. తాము అసలు ఎల్జీ పాలిమర్స్ కి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసారు. కరోనా కేసులు పెరిగినా సరే తాము ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా సిద్దంగా ఉన్నామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేసారు. రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉంది అంటూ అవంతి వ్యాఖ్యానించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన విజ్ఞప్తి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: