ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాల మధ్య నీటి యుద్దాలు జరుగుతూనే ఉన్నాయి. నిన్నటి వరకు కృష్ణా వరద జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు రాగా ఇప్పుడు గోదావరి జలాల విషయంలో రెండు రాష్ట్రాలు మళ్ళీ పోరాటానికి దిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

 

తాజా పరిస్థితులు చూస్తే ఇదే విషయం అర్ధమవుతుంది. గోదావరి పై తెలంగాణా కడుతున్న 7 ప్రాజెక్టులపై ఏపీ సర్కార్ అభ్యంతరాలు తెలిపింది. దీనిపై వివరణ ఇవ్వాలని, 7 ప్రాజెక్ట్ లకు సంభందించిన డీపీఆర్ లు ఇవ్వాలని తెలంగాణా ప్రభుత్వానికి గోదావరి బోర్డ్ లేఖ రాసింది. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. కృష్ణా జలాలను ఏపీ వాడుకుంటుంది అని తెలంగాణా ఫిర్యాదులు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: