పాకిస్తాన్ లో కరోనా వైరస్ చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ లాక్ డౌన్ ని ఎత్తివేయడం తో దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అక్కడ ఇప్పటి వరకు 45 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. దాదాపు వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక అక్కడ ఒక ఎమ్మెల్యే కూడా ప్రాణాలు కోల్పోయారు.
పాకిస్తాన్లో అధికార తెహ్రీక్ ఇన్సాఫ్ నుంచి ఎమ్మెల్యే గా ఉన్న షహీన్ రజా అనే 65 ఏళ్ళ మహిళ కరోనా తో పోరాటం చేస్తూ బుధవారం ప్రాణాలు కోల్పోయారు.ఆమె గతంలో క్యాన్సర్ నుంచి బయటపడినా ఇప్పుడు కరోనా నుంచి బయటపడలేదు అని ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు అధికారులు.