హైదరాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం అగ్ని ప్రమాదం జరిగింది. జీడి మెట్లలో ఉన్న ఒక ఫార్మా కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది.  ఫార్మా కంపెనీ నుంచి భారీగా మంటలు బయటకు వస్తున్నాయి. ఇక అక్కడ కంపెనీ చుట్టూ కూడా పొగ పట్టేసింది. అక్కడ రసాయనాల కారణంగా ఈ మంటలు చెలరేగినట్టు తెలుస్తుంది.

 

దీనితో పెద్ద ఎత్తున అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకున్నాయి. చుట్టూ ఉన్న ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు ఎం జరుగుతుందో అనే భయ౦ వారిని వెంటాడుతుంది. ఇక ప్రభుత్వం కూడా ఈ ఘటన పై ఆరా తీసింది. మంత్రులకు కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. వారు అందరూ కూడా దీనిపై పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: