IHG

మేడ్చల్ జిల్లాలో  షామీరు పేట ఏరియాలో విషాద ఘటన కాలనీవాసుల ను  షాక్ కి గురి చేసింది. ఆ కాలనీ లో నివసిస్తున్న భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవ కారణంగా అభం శుభం తెలియని చిన్నారులు బలి అయ్యారు. పూర్తి వివరాల లోకి వెళ్తే గోపీనాథ్, ప్రీతి అనే దంపతులకు ఇద్దరు కుమారులు గౌరవ్ 4 ,కౌశిక్ 3 ఉన్నారు. వీరు శామీర్ పేట లోని మజీద్ పూర్ లో గత కొంతకాలంగా నివసిస్తున్నారు. అయితే భార్యాభర్తల మధ్య  తరచు గొడవలు జరుగుతూ ఉండేవి. తాజాగా భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా మనస్థాపానికి గురి అయిన ప్రీతి తన ఇద్దరు కుమారులకు విషం ఇచ్చి తాను తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

 

 

ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు చిన్నారులు కన్నుమూశారు. ప్రీతి  ఆరోగ్యం  విషమంగా మారింది. ప్రీతిని చిన్నతనంలో ఎవరో తెలియని వ్యక్తులు రైల్వే స్టేషన్ ఆవరణలో వదిలిపెట్టి వెళ్లిపోగా ఆమెను ఓ అనాధ శరణాలయం పెంచింది. ఆమె భర్త గోపీనాథ్ ఫార్మా  కంపెనీలో ఉద్యోగిగా చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ అనాథ శరణాలయానికి వెళ్లి ఓ అనాధ అమ్మాయిని పెళ్లి చేసుకునే ఉద్దేశం తో వచ్చాం అని చెప్పి ప్రీతి ని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి అయిన కొన్ని రోజుల వరకు బాగానే సంసారం  సాగింది. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని తగాదాల వల్ల ఆమె పలుమార్లు అనాధ శరణాలయానికి వెళ్ళేది. జరిగిన గొడవ కారణంగా తీవ్ర మనస్థాపానికి గురి అయ్యి విషాన్ని తన పిల్లలకు ఇచ్చి, తాను తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: