హైద‌రాబాద్‌లో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం మాత్రం త‌గ్గ‌డం లేదు. బుధ‌‌వారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 27 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 15 మంది ఉండగా.. వలసదారులు 12 మంది ఉన్నారు. గోషామహల్‌ జీహెచ్‌ఎంసీ 14వ జోన్‌ పరిధిలో బుధవారం ఒకే ఇంట్లో 8 మందికి కరోనా నిర్ధారణ అయింది. స్థానిక నట్రాజ్‌నగర్‌లో ఉంటున్న ఓ వ్యాపారికి (34) ఐదురోజుల క్రితం కరోనా పాజిటివ్‌ వచ్చింది.

 

దీంతో ఆయన కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా.. వ్యాపారి తండ్రి(55), తల్లి(48), భార్య(30), కుమారుడు(4), తమ్ముడు(28) తమ్ముడి భార్య(22), ఇద్దరు చెల్లెళ్లకు (22), (23) కరోనా సోకినట్టు తేలింది. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సం ఖ్య 1661కి చేరగా.. మరణాలు 40కి చేరాయి. హైదరాబాద్‌ మోతీనగర్‌కు చెందిన 61 ఏళ్ల వ్య క్తి, చాంద్రాయణగుట్టకు చెందిన 81 ఏళ్ల వ్యక్తి బుధ‌వారం మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: