తెలంగాణ‌లోని నల్గొండ జిల్లా చిట్యాల శివారులో ఉన్న రిలయన్స్ పెట్రోల్‌ బంక్ వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగివున్న లారీని వెనక నుంచి ఓ ఎర్టీగా కారు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు కామినేని ఆస్పత్రికి తరలించారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి నుంచి హైదరాబాద్ వెళుతుండగా జాతీయ రహదారి (NH65)పై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.

 

మృతి చెందిన ముగ్గురు రాజమండ్రి దగ్గర కొత్తపల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు క్షేమంగా ఉన్నారని పోలీసులు చెప్పారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఎనిమిది మంది ప్రయాణం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: