కరోనా వైరస్ ని ఎదుర్కోవడంలో భాగంగా ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఇప్పుడు వెంటిలేటర్ల అవసరం ఎక్కువగా ఆంది. అయితే వెంటిలేటర్లు చాలా దేశాల్లో అందుబాటులో లేక ప్రాణాలు కోల్పోతున్నారు. వాటి ఖరీదు కూడా చాలా ఎక్కువగా ఉంది. అయితే కృతికరె ఇండియా సంస్థ చాలా తక్కువ ధరకే వెంటిలేటర్లను తయారు చేస్తుంది.
అశోక్ లేలాండ్తో ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. తక్కువ ధరకే భారీగా వెంటిలేటర్లను తయారు చేసి దేశం మొత్తం పంపాలని సదరు సంస్థ భావిస్తుంది. దీని ధర ఎంత అనేది ఇంకా తెలియదు. ఇన్వాసివ్, నాన్ ఇన్వాసివ్ రెండు పద్ధతుల్లో ఆక్సిజన్ సరఫరా జరిగే విధంగా వాటిని తయారు చేస్తారు. త్వరలోనే దీని ధరను వెల్లడిస్తారు. 40 శాతం తక్కువగా ఉండే అవకాశం ఉంది.