కర్ణాటకలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి పెరగడం ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా కలవరపెడుతుంది. కరోనా కట్టడిలో ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా సరే కేసులు మాత్రం ఆగలేదు. ఈ నేపధ్యంలో కరోనా కట్టడి లో భాగంగా కర్ణాటక ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర సరిహద్దులను పూర్తిగా మూసి వేసింది. 

 

ఇక ఇప్పుడు కరోనా కంటైన్మెంటు జోన్లలో 60 ఏళ్ల వయసు దాటిన సీనియర్ సిటిజన్లు అందరికీ స్వాబ్ పరీక్షలు చెయ్యాలి అంటూ ఆదేశాలు ఇచ్చింది. విజయపుర జిల్లాలో కేసులు బాగా నమోదు అవుతున్నాయి. ఈ మేరకు మాట్లాడిన విజయపుర డిప్యూటీ కమిషనర్ వైఎస్ పాటిల్..  కంటైన్మెంటు జోన్ లో సీనియర్ సిటిజన్లు అందరికీ కరోనా పరీక్షలు చేస్తామని ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: