ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వైఎస్సార్‌ వాహనమిత్ర పథకానికి అర్హులైనవారంతా ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని రవాణాశాఖ ఉపకమిషనర్‌ రాజారత్నం సూచించారు. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ యజమాని కమ్‌ డ్రైవర్‌కు రూ.10 వేల చొప్పున అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం  వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకాన్ని ప్రవేశపెట్టిన విష‌యం తెలిసిందే.

 

రూరల్‌ జిల్లా పరిధిలో అయితే ఎంపీడీవో కార్యాలయంలో, నగర పరిధిలోనివారైతే వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తులను అప్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుతోపాటు ఆధార్‌కార్డు, తెల్ల రేషన్‌కార్డు,  వాహన రిజిస్ర్టేషన్‌ సర్టిఫికెట్‌, రుణంలేని బ్యాంకు పాస్‌బుక్‌ మొదటిపేజీ, కుల ధ్రువీకరణపత్రం అందజేయాల‌ని అధికారులు సూచించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: