లాక్ డౌన్ కారణంగా గత కొన్ని రోజులుగా షూటింగ్ లు ఆగిపోయి టాలీవుడ్ లో ఆందోళన వ్యక్తమవుతుంది. పెద్ద ఎత్తున ఇప్పుడు నిర్మాతలకు ఆర్ధికంగా నష్టం వస్తుంది అనే ఆందోళన మొదలైంది. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ లో అగ్ర నిర్మాతలు నటులు షూటింగ్ లకు సిద్దమవుతున్నారు. 

 

చిరంజీవి ఇంట్లో కాసేపట్లో టాలీవుడ్ పెద్దలు సమావేశం అవుతున్నారు. షూటింగ్ అనుమతుల కోసం ప్రభుత్వాన్ని సంప్రదించే ఆలోచనలో టాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో చర్చలు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అగ్ర నిర్మాతలు నటులు దర్శకులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. దీనిలో ఏ నిర్ణయం తీసుకుంటారా అనేది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: