తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పలు రైతు సంక్షేమ పథకాలు దేశంలోని అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. రైతుబంధ పథకం ద్వారా రైతులకు పంటపెట్టుబడిని అందిస్తోంది. తాజాగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్ఫూర్తితో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు ముందడుగు వేసింది. రైతులను ఆదుకునేందుకు రాజీవ్గాంధీ కిసాన్ న్యాయ్ యోజన పథకాన్ని తీసుకువచ్చింది. పథకం అమలులో భాగంగా నేడు మొదటిదశలో రూ. 1500 కోట్లను రైతుల ఖాతాలో నేరుగా జమచేస్తోంది. ఈ పథకం కింద మొత్తం రూ.5,700 కోట్లు కేటాయించింది.
ఈ పథకం ప్రారంభోత్స కార్యక్రమంలో ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ నాయకుడు రాహుల్గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేల్ భాగెల్ ఉన్నతాధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పథకం కింద రాష్ట్రంలో మొత్తం 9 లక్షల 53 వేల 706 మంది సన్నకారు రైతులు, 5 లక్షల 60 వేల మంది చిన్నకారు రైతులు అదేవిధంగా 3 లక్షల 20 వేల 844 మంది పెద్ద రైతులు లబ్ధిపొందనున్నారు.