ఒక పక్క కరోనా వైరస్ తో దేశం మొత్తం అల్లాడుతున్నా దొంగతనాలు మాత్రం ఆగడం లేదు. దేశ వ్యాప్తంగా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ దొంగలను పట్టుకునే పోలీసులకు కొత్త భయం మొదలయింది. ఇటీవల ఉత్తరప్రదేశ్, ఓడిస్సా రాష్ట్రాల్లో దొంగలను పట్టుకున్న పోలీసులకు కరోనా వచ్చిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. 

 

తాజాగా కర్ణాటక రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. బెంగళూరు నగర సమీపంలో ఓ వ్యక్తిని ఇనుప కమ్మీ దొంగలించినట్లు ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పనిలో పనిగా దొంగకి కరోనా పరిక్షలు చేయగా అతనికి కరోనా ఉందని తెలిసింది. దీనితో బాబుని చక్కగా కోవిడ్ ఆస్పత్రికి తరలించి బాబు కోసం తిరిగిన పోలీసులను 15 మందిని క్వారంటైన్ లో ఉంచారు. పనిలో పనిగా కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: