ఆంధ్రప్రదేశ్ లో కరోన వైరస్ ఆగలేదు. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లాక్ డౌన్ ఉన్నా సరే కరోనా మాత్రం కట్టడి అయ్యే అవకాశాలు ఏ విధంగా కూడా కనపడటం లేదు. ఇక తాజాగా గత 24 గంటల్లో 45 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాసేపటి క్రితం వెల్లడించింది. 

 

దీనితో కరోనా కేసుల సంఖ్య 2,452 కి చేరుకుంది. ప్రస్తుతం 718 యాక్టివ్ కేసులు ఉండగా 1680 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని బయటపడ్డారు. ఇక మరణాలు 54 కి చేరుకున్నాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో కేసులు ఇంకా తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక లాక్ డౌన్ ని కొన్ని ప్రాంతాల్లో సడలించింది ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: