ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. అయిపోయిన పెళ్లికి పవన్ బాజాలు కొట్టాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పురోహితులకు ప్రభుత్వం ఇప్పటికే సహాయం చేస్తామని చెప్పిందని ... ప్రభుత్వం సహాయం ప్రకటించిన తరువాత కూడా ఆదుకోవాలంటూ పవన్ ప్రకటన విడుదల చేయడంపై మంత్రి మండిపడ్డారు. 
 
'సాయం ప్రకటించాక డిమాండ్ చేయడం ఏంటండీ పవన్ కళ్యాణ్... కామెడీ కాకుంటే అని మంత్రి సెటైర్లు వేశారు. పుస్తకాలు చదివి పవన్ కు మతి పోయిందా...? అని ప్రశ్నించారు. ప్యాకేజీ రాజకీయాలు చేసే పవన్ నిద్ర లేచిన తర్వాత నిజాలు తెలుసుకొని అన్నారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో మే నెల 26న అర్చకులకు ఐదు వేల రూపాయల చొప్పున సాయం అందిస్తున్నట్లు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: