దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం రోజురోజుకూ తీవ్ర‌మ‌వుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 571 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని ఢిల్లీ  ప్రభుత్వం తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 11,659కు చేరుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు 5,567 బాధితులు క‌రోనా వైర‌స్ బారి నుంచి కోలుకున్నారు. అలాగే.. 194 మరణాలు సంభ‌వించాయి. అయితే.. వైర‌స్ వ్యాప్తి నిరోధానికి ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండ‌గా.. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు పాజిటివ్ కేసుల సంఖ్య‌ 1,12,359కు చేరింది. ఇప్ప‌టివ‌ర‌కు 45,300 క‌రోనా నుంచి కోలుకున్నారు.

 

దేశంలో రికవరీ రేటు 40.31 శాతానికి చేరుకుంది. ఈ రోజు ఉదయం 9.00 గంటల వరకు దేశంలో కొవిడ్ -19 కోసం 26,15,920 నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తెలిపింది. గత 24 గంటల్లో సుమారు 1,03,532 నమూనాలను పరీక్షించారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: