తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో వింత ఘటన చోటు చేసుకుంది. గూగుల్ మ్యాప్స్ భార్యాభర్తల మధ్య గొడవ పెట్టింది. ఓ భర్త తాను ఎదుర్కొన్న విపత్కర పరిస్థితిని ఇది. తమిళనాడులోని మైలాదుతురాయ్‌కి చెందిన ఆర్. చంద్రశేఖర‌న్ అనే వ్యక్తి గూగుల్ వల్ల తనకూ తన భార్యకు మధ్య గొడవలు జరిగాయని... గూగుల్ పై కేసు నమోదు చేసుకోవాలని కోరాడు. తన కాపురంలో కలతలకు గూగుల్ కారణమైందని... ఆ సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
ప్రతిరోజూ తాను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తరువాత మొబైల్ చెక్ చేసి తాను ఎక్కడికి వెళ్లానో భార్య తెలుసునేదని... గూగుల్ మ్యాప్స్ మే నెల 20వ తేదీన తాను వెళ్లని ప్రాంతాలకు కూడా వెళ్లినట్టు చూపించడంతో కాపురంతో కలతలు రేగాయని చెప్పాడు. అయితే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకోలేదని సమాచారం. అయితే పోలీసులు ఈ ఘటన నిజంగా జరిగిందో లేదో నిర్ధారించుకునే పనిలో పడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: