లాక్ డౌన్ తర్వాత క్రమంగా తెరుచుకుంటున్న కంపెనీలు ప్రమాదానికి గురవుతున్నాయి. విశాఖ ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం బయటపడిన తర్వాత దేశంలో పలు కంపెనీల్లో అగ్ని ప్రమాదాలు, గ్యాస్ లీక్ ఘటనలు బయటపడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని బొల్లారం పీఎన్ఎం లైఫ్ సైన్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది. 

 

రియాక్టర్ పేలింది... ఈ ఘటనలో భారీగా ఎగిసిపడుతున్నాయి మంటలు. దీనితో ఆ చుట్టూ కూడా దట్టమైన పొగలు కమ్మేశాయి. ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని ప్రజలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని అధికారులు చెప్తున్నారు. అనవసరంగా హడావుడి అవసరం లేదని సూచిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సింది. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: