మద్యం ఇసుక అక్రమ రవాణా విషయంలో ఏర్పాటు చేసిన ఎస్ఈబీ విషయంలో సిఎం వైఎస్ జగన్ చాలా వరకు సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు ఇసుక అక్రమాలకు పాల్పడ్డారని కేసు కూడా నమోదు అయింది. 

 

అయితే వారు ఎక్సైజ్ శాఖ నుంచి ఎస్ఈబీ కి సిబ్బందిని బదలాయించే విషయంలో జోక్యం చేసుకున్నారని జగన్ కి సమాచారం అందడంతో ఈ విషయంలో ఎవరి జోక్యం వద్దని తన జోక్యం కూడా ఉండదు అని ఇసుక మద్యం అక్రమం విషయంలో తాను చాలా సీరియస్ గా ఉన్నా అని ఎవరు అయినా సరే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేసినట్టు సమాచారం. వారి విషయంలో జోక్యం చేసుకుంటే కఠిన నిర్ణయాలు ఉంటాయని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: