తెలంగాణ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఐదుగురు కరోనా భారీన పడి మృతి చెందారు. రాష్ట్రంలో ఈరోజు 38 కరోనా కేసులు నమోదు కాగా ఐదుగురు కరోనా భారీన పడి మృతి చెందారు. రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ ఒకేరోజు ఐదుగురు మృతి చెందలేదు. ఈరోజు ఐదుగురు మృతి చెందడంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 45కు చేరింది. 
 
రాష్ట్రంలో ఈరోజు వరకు 1699 కరోనా కేసులు నమోదు కాగా 1036 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 618 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో 23 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒకేరోజు భారీ సంఖ్యలో మరణాలు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: