ప్రియాంకాచోప్రా.. బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌లో అడుగుపెట్టి గ్లోబ‌ల్‌స్టార్‌గా ఎదిగిన హీరోయిన్‌. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి కొన‌సాగుతున్న లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమితమైన అ బ్యూటీ గ‌త జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకుంటోంది. కొన్నింటిని ట్విట్ట‌ర్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంటోంది. తాజాగా.. మ‌రో ట్వీట్ చేసింది ఈ సుంద‌రి.

 

*తింకా తింకా నా మునుపటి చిత్రాలలో ఒకటైన కరం (డీడ్) లోని పాట. ఇది 2005 లో విడుదలైంది. సినిమా సంగీత ద‌ర్శ‌కులు చాలా మంది నటీనటుల కోసం ప్లేబ్యాక్ సింగర్లను ఉపయోగిస్తాయి. ఇందులో కొంద‌రు అద్భుత‌మైన గాయ‌కులు ఉన్నారు. నా చిత్రాలకు వారి స్వరాన్ని సంవత్సరాలుగా అందించారు. ఆ అదృష్టం నాకు ద‌క్కింది* అని ప్రియాంక వెల్ల‌డించింది. *నిజానికి ఈ పాట విడుల అయిన‌ప్పుడు అంద‌రూ నేనే అనుకున్నారు. కానీ.. ఆ స్వ‌రం నాకు ఇష్ట‌మైన గాయ‌కుల‌లో ఒక‌రైన‌ ఎలీషాది. థాంక్యూ ఎలీషా* అంటూ మ‌రో ట్వీట్ చేసింది ప్రియాకం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: