కరోనా వైరస్ కట్టడికి కొనసాగుతున్న లాక్డౌన్ నుంచి కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే అనేక రంగాల కార్యకలాపాలు క్రమంగా ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10:00 గంటలకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. గతంలోనూ ఆయన మీడియా సమావేశం నిర్వహించి కీలక అంశాలను వెల్లడించిన విషయం తెలిసిందే.
ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ బ్యాంకు సిబ్బంది ధైర్యంగా విధులు నిర్వహిస్తున్నారంటూ అభినందించారు. ఇదే సమయంలో దేశ ఆర్థిక వృద్ధిరేట్, తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. దేశంలో అనేక రంగాల కార్యకలాపాలు ప్రారంభం అవుతుండడంతో ఆర్బీఐ గవర్నర్ ఏం చెబుతారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.