ఇప్పుడు కరోనా కారణంగా చాలా దేశాలు ఆర్ధికంగా ఇబ్బంది పడటమే కాదు క్రీడా ప్రపంచం కూడా ఎన్నో ఇబ్బందులు పడుతుంది అనేది వాస్తవం. ఇప్పుడు క్రికెట్ మ్యాచులు జరిగే అవకాశాలు దాదాపుగా ఏ దేశంలో కూడా లేవు. దీనితో ప్రేక్షకులు ఇప్పుడు టీవీ లో పాత క్రికెట్ మ్యాచులను చూసుకునే పరిస్థితి వచ్చింది. 

 

ఇక ఈ తరుణంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి. జూన్ లేదా జులై లో భారత జట్టుని విదేశాలకు పంపాలని భావిస్తున్నారు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా తో మన దేశం టి20 సీరీస్ ఆడటానికి సిద్దమవుతుంది. ఆ దేశ జట్టుని ఇక్కడికి ఆహ్వానించడం లేదా మనమే అక్కడికి వెళ్ళడం ఏదోక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే ప్రకటన రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: