వరంగల్ జిల్లాలో వలస కార్మికుల మృతదేహాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. వరంగల్ జిల్లా గొర్రె కుంట శివారు లో ఉన్న సుప్రియ కోల్డ్ స్టోరేజి ఆవరణ లో ఉన్న బావిలో నాలుగు మృతదేహాలు కనిపించాయి. ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు, ఒక చిన్నారి బావిలో కనిపించారు. దీనితో ఒక్కసారిగా కలకలం రేగింది. '

 

అదే బావిలో నేడు పోలీసులు మరో వలస కార్మికుడి మృతదేహాన్ని గుర్తించారు. వారిది బెంగాల్ అని పోలీసులు వెల్లడించారు. అయితే వారు కావాలని దూకారా లేక ఎవరైనా హత్య చేసి అందులో పడేసారా అనేది అర్ధం కావడం లేదు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేసారు. 20 ఏళ్ళ క్రితం వాళ్ళు బెంగాల్ నుంచి వలస వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: