తెలంగాణాలో ఇప్పుడు హరిత హారం విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. మొక్కలను నాశనం చేసిన వాళ్ల విషయంలో ఎప్పటికప్పుడు అధికారులు జరిమానా విదిస్తునే ఉన్నారు. అయినా సరే కొందరిలో మార్పు మాత్రం రావడం లేదు. తాజాగా సిద్దిపేట మున్సిపల్‌ పరిధిలోని రంగధాంపల్లి శివారులో డివైడర్‌పై ఉన్న 12 హరితహారం మొక్కలను ధ్వంసం చేసారు ఒక లారీ డ్రైవర్. 

 

ఈనెల 18న కర్ణాటకకు చెందిన డ్రైవర్‌ ఎండీ సయ్యద్‌  డివైడర్‌పైకి లారీని ఎక్కించడంతో  మొక్కలు చనిపోయాయని దీనితో అతనికి 10 వేల జరిమానా విధిస్తున్నామని మున్సిపల్ అధికారి సామల ఐలయ్య పేర్కొన్నారు. ఫోన్ ద్వారా సదరు లారీ యజమానికి చెప్పగా అతను మున్సిపల్ ఖాతాలో జమ చేసాడు అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: