దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతూనే ఉంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం మాత్రం ఉండటం లేదు. లాక్ డౌన్ లో కూడా దేశంలో గత నాలుగు రోజుల నుంచి 5 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇక తొలిసారి దేశంలో నిన్న ఒక్క రోజే ఆరు వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

 

6,198 కొత్త కేసులతో పాటుగా 150 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీనితో మొత్తం కేసుల సంఖ్య 118,226 కి చేరుకుంది. ఇక మరణాలు కూడా వేగంగా నమోదు అవుతున్నాయి. మొత్తం మరణాల సంఖ్య 3,584 గా ఉంది. ఇక రికవరీ రేటు మాత్రం 40 శాతం ఉండటం హర్షించే విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: