దేశంలో కరోనా కారణంగా క్రికెట్ ప్రేక్షకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో ప్రతీ దేశంలో ఏదోక సీరీస్ ఉండేది. ఏదోక మ్యాచ్ వస్తూనే ఉండేది. ఇప్పుడు కరోనా కారణంగా ఏ ఒక్క క్రికెట్ మ్యాచ్ కూడా జరిగే అవకాశాలు కనపడటం లేదు అనే చెప్పాలి. ఈ నేపధ్యంలోనే కొన్ని టోర్నీలను కూడా వాయిదా వేసారు. ఐపిఎల్ ని ఇప్పటికే వాయిదా వేసారు. 

 

ఇక ఇప్పుడు టి20 వరల్డ్ కప్ ని కూడా వచ్చే ఏడాది నిర్వహించే ఆలోచనలో ఐసిసి ఉంది అనే వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే పలు దేశాల క్రికెట్ బోర్డులతో ఐసిసి మాట్లాడుతుందని చాలా దేశాలు అందుకు ఓకే చెప్పాయని అంటున్నారు. అక్టోబర్ నవంబర్ లో ఇది జరగాల్సి ఉంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: