ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి కుటుంబంపై క‌డ‌ప జిల్లా పులివెందుల నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఎంత అభిమానం చూపుతారో ?  ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అంద‌కే సాధార‌ణ గ్రామం కాస్తా ఇప్పుడు పెద్ద మున్సిపాల్టీ అయిపోయింది. పులివెందుల‌లో ఉన్న అభివృద్ధి ఎక్క‌డా జ‌ర‌గ‌లేద‌న్న‌ది నిజం. ఆ రేంజ్‌లో నాడు వైఎస్‌.. ఆ త‌ర్వాత జ‌గ‌న్ ఇక్క‌డ అభివృద్ధి ప‌నులు చేప‌ట్టారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే గ‌త ఎన్నిక‌ల్లో పులివెందుల జ‌నాలు జ‌గ‌న్‌కు ఏకంగా 90 వేల పై చిలుకు భారీ మెజార్టీ క‌ట్ట‌బెట్టారు.

 

ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ ఇప్పుడు పులివెందుల‌కు అదిరిపోయే వ‌రం ఇచ్చారు. పులివెందులలో కొత్త మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు సంబంధించి ఆగస్టు కల్లా టెండర్ల ప్రక్రియ చేపట్టి ఈ ఏడాదిలోనే పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (పాడా)పై సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయంలో సమీక్షలో ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఏదేమైనా వైఎస్ కుటుంబం పులివెందుల‌పై మ‌రోసారి త‌న ప్రేమ‌ను చాటుకుంద‌ని పులివెందుల ప్ర‌జ‌లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: