వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో ఉన్న ఒక కోల్డ్ స్టోరేజి ఆవరణ లో ఉన్న బావిలో వరుసగా మృతదేహాలు బయటకు వస్తున్నాయి. నిన్న సాయంత్రం నాలుగు బయటకు తీయగా నేడు మరో 5 బయటకు తీసారు. దీని తో మొత్తం 9 మృతదేహాలు బయటకు వచ్చాయి. 

 

20 ఏళ్ళ క్రితం బెంగాల్ నుంచి మక్సూద్ అనే వ్యక్తి కుటుంబం బెంగాల్ నుంచి వచ్చింది. వాళ్ళు స్థానికంగా ఉంటూ కూలి నాలీ చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇక నేడు ఉదయం గంటకు ఒకటి చొప్పున మృతదేహాలు బయటకు వస్తున్నాయి. అక్కడి మున్సిపల్ సిబ్బంది బావిలో నీళ్ళు తోడుతున్నారు. ఇంకా శవాలు బయటపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనితో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: