జమ్ముకశ్మీర్‌లో మ‌రో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు పోలీసుల‌కు చిక్కారు. త్రాల్‌, అవంతిపురాలో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు నిషేధిత సంస్థలైన హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌, అన్సర్‌ గజ్వత్‌ ఉల్‌ హింద్‌ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినవారని పోలీసులు గుర్తించారు. ఉగ్రవాదులకు అవసరమైన వస్తువులను ఎప్ప‌టిక‌ప్పుడు అంద‌జేయడం, సున్నితమైన విషయాలను ఉగ్ర‌వాదుల‌కు చేరవేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలిపారు.

 

వారివద్ద ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవ‌లి కాలంగా ఈ ప్రాంతంలో కొంత ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొంటున్న విష‌యం తెలిసిందే. త‌రుచూ ఉగ్ర‌వాదులు, భార‌త‌బ‌ల‌గాల మ‌ధ్య కాల్పులు చోటుచేసుకుంటున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: