రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎండలు  చుక్కలు చూపిస్తున్నాయి. రోహిణి కార్తేకు ముందే ఎండలు దారుణంగా ఉన్నాయి. ఈ నెల 24 వరకు వడ గాల్పులు వీచే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు రికార్డు స్థాయిలో ఎండలు నమోదు అవుతున్నాయి. 

 

ఊహించని విధంగా ఎండలు సాధారణం కంటే మూడు డిగ్రీల నుంచి 6 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. 46 నుంచి 48 డిగ్రీల వరకు కొన్ని ప్రాంతాల్లో ఎండలు నమోదు అవుతున్నాయి. తెలంగాణాలో అయితే కొన్ని ప్రాంతాల్లో అసలు ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఉంది. నిన్న ద్వారకా  తిరుమలలో ఏకంగా 48 డిగ్రీల ఉష్ణో గ్రాత నమోదు అయింది. దీనితో ఎండలు అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: