పాకిస్తాన్ లో విమాన ప్రమాదం జరిగింది. లాహోర్ నుంచి కరాచి వెళ్తుండగా విమానం కూలిపోయింది. కరాచి విమానాశ్రయం వద్ద ఈ విమానం కుప్ప కూలింది. ఎంత మంది మరణించారు ఎంత మందికి గాయాలు అయ్యాయి అనేది ఇంకా తెలియలేదు. విమానంలో 200 మంది ఉన్నట్టు తెలుస్తుంది. 

 

వీరిలో ఎవరు అయినా గాయపడ్డారా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు. ఈ ఘటనలో మరణాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విమానాశ్రయం వద్ద అర్మీని మొహరించారని సమాచారం. పాకిస్తాన్ ప్రభుత్వం ఇంకా దీనిపై స్పందించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: