దేశ వ్యాప్తంగా ఇప్పుడు సినీ పరిశ్రమ కష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు అన్ని భాషల్లో కూడా సినిమాలు విడుదల ఆగిపోయిన పరిస్థితి. ఎక్కడా కూడా సినిమాలను విడుదల చేసే అవకాశాలు కనపడటం లేదు. ఈ నేపధ్యంలో బాలీవుడ్ సినీ పెద్దలు ప్రధాని నరేంద్ర మోడితో భేటి అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 

 

అగ్ర దర్శక నిర్మాతలు అందరూ కూడా మోడీ తో సమావేశమై తమకు వచ్చిన నష్టాలను వివరించాలని వాళ్ళు భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖాన్ త్రయం తో పాటుగా సంజయ్ లీలా బన్సాలి, అమితాబ్, అలాగే కొందరు హీరోయిన్ లు కూడా వెళ్లి కలిసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే తెలంగాణాలో కేసీఆర్ ని సినీ ప్రముఖులు కలిసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: