కరోనా వైరస్ సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో విదేశాల్లో భారతీయులు చిక్కుకున్న విషయం తెలిసిందే. వీరందరిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ చేపట్టింది. దశలవారీగా భారతీయులను స్వదేశానికి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని విశాఖకు కౌలాలంపూర్ నుంచి ప్రత్యేక విమానం చేరుకుంది. ఈ విమానంలో వివిధ జిల్లాలకు చెందిన 59 మంది తెలుగువారు ఉన్నారు.
విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సులో వారిని ఆయా జిల్లాలకు తరలించారు అధికారు. ఇక ఇదే సమయంలో విశాఖకు చెందిన 18 మందిని అధికారులు క్వారంటైన్కు తరలించారు. ఇంతకుముందు కూడా పలు దేశాల నుంచి తెలుగువారు ఏపీకి చేరుకున్న విషయం తెలిసిందే. క్వారంటైన్ ముగిసిన తర్వాత వీరిని ఇళ్లకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వనున్నారు.