ఇటీవల హర్యానా నుంచి బీహార్ లోని దర్బంగా కు చేరుకోవడానికి జ్యోతి అనే 13 ఏళ్ళ చిన్నారి సైకిల్ తొక్కడం ప్రపంచ దేశాలను నివ్వెర పరిచింది అనే చెప్పుకోవచ్చు. ఈ వార్త అంతర్జాతీయ మీడియా లో కూడా ప్రధానంగా హైలెట్ అయింది. ఇక ఆ బాలిక సాహసం చూసిన చాలా మంది ఆమెకు తండ్రి మీద ఉన్న ప్రేమను చూసిన విస్మయం వ్యక్తం చేసారు. 

 

ఇక తాజాగా దీనిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ట్వీట్ చేసారు. 5 ఏళ్ల జ్యోతి కుమారి గాయపడిన తన తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకొని ఏడు రోజుల పాటు 1200 వందల కిలోమీటర్ల ప్రయాణం చేయడం అత్యంత అద్భుతమనే చెప్పాలని ఆమె పేర్కొన్నారు. భారతీయ ప్రజలో ఇంత ఓర్పు, సహనం, ప్రేమ  ఉంటాయనేది ఈమె ద్వారా నాకు తెలిసిందన్నారు. ఇది కేవలం నన్ను మాత్రమే గాక సైక్లింగ్‌ ఫెడరేషన్‌ను ఆకర్షించిందని ఆమె పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: