హైదరాబాద్ లో రోజు రోజుకి కరోనా కేసులు పెరగడం తో తెలంగాణా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. హైదరాబాద్ లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపధ్యంలో కేసీఆర్ హైదరాబాద్ ని పూర్తిగా మూసేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. రెండు వారాల్లో 500 కేసులు నమోదు అయ్యాయి. 

 

ప్రతీ రోజు అక్కడ 30 కి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇక పోలీసులకు కూడా హైదరాబాద్ లో కరోన వస్తుంది. దీనిపై ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో పరిస్థితి అదుపులోనే ఉందని రాబోయే రెండు మూడు వారాలు జాగ్రత్తగా ఉంటే చాలు అని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే అవసరం అయితే హైదరాబాద్ ని మూసి వేసే ఆలోచనలో కూడా ఆయన ఉన్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: