భారత్ లో కరోనా కేసులు ఊహించని విధంగా నమోదు అవుతున్నాయి. మూడు రోజుల్లో ఏకంగా 16 వేల కేసులు నమోదు అయ్యాయి అంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలించడం లేదు అనే చెప్పవచ్చు. ఇక గత 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి దేశంలో. 

 

గత 24 గంటల్లో భారతదేశంలో 6654 కేసులు, మరియు 137 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 125101, ఇందులో 69597 క్రియాశీల కేసులు మరియు 3720 మరణాలు ఉన్నాయి. కాసేపటి క్రితం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: