ఒడిశా  లో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి పెరుగుతున్నాయి. ప్రతీ రోజు కరోనా కేసులు అక్కడ దాదాపు 70 వరకు నమోదు అవుతున్నాయి. రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి గాని అక్కడ తగ్గడం లేదు. కరోనా దేశంలో తీవ్రత పెరుగుతున్న సమయంలో అక్కడ మాత్రం జీరో కేసులు కూడా నమోదు అయిన సంగతి తెలిసిందే. 

 

ఇక ఇప్పుడు అక్కడ కేసులు పెరగడం దానికి తోడు రెండు రోజుల క్రితం వచ్చిన తుఫాన్ ఆందోళన కలిగిస్తుంది. ఇదిలా ఉంటే గత 24 గంటల్లో అక్కడ 80 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1269 గా ఉంది. క్రియాశీల కేసులు 826 వద్ద ఉన్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: