దేశ వ్యాప్తంగా ప్రజల అవసరాలను దృష్టి లో పెట్టుకుని బార్బర్ షాపులను ఓపెన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో లో కూడా బార్బర్ షాపులను ఓపెన్ చేసారు మే 21 నుంచి అనుమతులు రావడంతో చాలా వరకు జాగ్రత్తగానే బార్బర్ షాపులను ఓపెన్ చేసారు. 

 

ఒక సెలూన్ యజమాని ఈ సందర్భంగా మాట్లాడుతూ... "ఈ నిర్ణయం తీసుకున్నందుకు జిల్లా మేజిస్ట్రేట్కు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మాస్క్ లు లేకుండా తాము ఎవరిని అంగీకరించడం లేదని ఆయన పేర్కొన్నారు. ఇక సెలూన్ లో అన్ని విధాలుగా తాము జాగ్రత్తలు చెప్తున్నామని కచ్చితంగా వాటిని పాటించాలని ఆయన పేర్కొన్నారు. తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో సెలూన్ షాపులకు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: