లాక్ డౌన్ విషయంలో ఇప్పుడు పోలీసులు చాలా సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక పార్క్ లు సినిమా హాల్స్ సహా జనాలు ఒక చోటకు వచ్చే ఏ ప్రదేశానికి కూడా అధికారుల నుంచి అనుమతి అనేది రావడం లేదు. దీనితో జనాలు కోరికను చంపుకుని ఇంట్లోనే ఉంటున్నారు. కేసుల తీవ్రతను అర్ధం చేసుకుని వాళ్ళు పోలీసులకు సహకరిస్తున్నారు.
ఈ తరుణంలో తాజాగా ఒక సంఘటన చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్లో ఒక పార్కులోకి ప్రవేశించకుండా ఆపడంతో... ఒక బాలుడు సెక్యూరిటీ గార్డును చెంపదెబ్బ కొట్టాడు. అక్కడ ఉన్న కెమెరాల్లో ఇది రికార్డ్ అయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
#Lockdown | A security guard was slapped by a boy in gautam buddha nagar, Uttar Pradesh, after he was allegedly stopped from entering a park. pic.twitter.com/hw22d3qeWJ
— Hindustan Times (@htTweets) May 23, 2020