వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఎంపీ విజయసాయిరెడ్డి రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ ప్రజా తీర్పు వెలువడిన ఈరోజు చిరస్మరణీయమని ఆయన అన్నారు. రాష్ట్రంలో తొమ్మిదేళ్లపాటు ఎనెన్నో కుట్రలు చేశారని... జగన్ ను అభిమన్యుడిలా ఒంటిరివాడిని చేసి మట్టుపెట్టాలని చూశారని అన్నారు. 
 
కర్ణుడిలా అశక్తుడిని చేసి హతమార్చాలని స్కెచ్చులు వేసినా... ఆ గుండె ధైర్యం, పట్టుదల ముందు ప్రత్యర్థులు తోక ముడవక తప్పలేదని అన్నారు. ప్రజలకు జీవితకాల భరోసాగా సీఎం జగన్ నిలిచాడని చెప్పారు. ఏడాది క్రితం ఇదే రోజు, ‘ఫ్యాన్’ ప్రభంజనాన్ని దేశమంతా కళ్లార్పకుండా చూసిందని... ఏకపక్ష విజయంతో చరిత్రను జగన్ తిరగరాశారని అన్నారు. వేల కోట్లు వెదజల్లిన పచ్చ పార్టీని పాతాళానికి తొక్కారని ట్వీట్ చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: