భార‌త్‌లోని లడఖ్‌లోని నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద చైనా బ‌ల‌గాల‌తో ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈరోజు ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ ఎంఎం న‌ర‌వాణే.. లేహ్‌లో ప‌ర్య‌టించారు. అక్క‌డి ప‌రిస్థితుల‌ను ఆయ‌న స్వ‌యంగా స‌మీక్షించారు. ఫీల్డ్ క‌మాండ‌ర్ల‌తో స‌మావేశ‌మై ప‌రిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. నార్త్ ఆర్మీ క‌మాండ‌ర్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ వైకే జోషి, 14 కార్ప‌ర్స్ చీఫ్ లెప్టినెంట్ జ‌న‌ర‌ల్ హ‌రింద‌ర్ సింగ్‌లు.. ఆర్మీ చీఫ్‌కు అక్క‌డ ప‌రిస్థితుల‌ను వివ‌రించారు.

 

ఇదిలా ఉండ‌గా..  గ‌త నెల‌లో ల‌డ‌ఖ్‌లోని పాన్‌గంగ్ లేక్‌తో పాటు సిక్కింలోని నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద కూడా చైనా సైనికుల‌తో మ‌న జ‌వాన్ల బాహీబాహీకి దిగిన విష‌యం తెల‌సిందే. ఈ ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆర్మీ  చీఫ్ ప‌ర్య‌టించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: