మరోసారి కాల్పుల మోతతో అడవి దద్దరిల్లింది. ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్దరు మావోయిస్టుల మృతి చెందారు. ఉదయం నుంచి పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టుల మృతి చెందారు. ఈ ఘటనతో మరోసారి అటవీ ప్రాంతం ఉలిక్కిపడింది. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే.. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

నిజానికి.. కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నేపథ్యంలో తాము పోలీసులపై దాడికి దిగబోమ‌ని ఇటీవల మావోయిస్టులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో పోలీసులు తమపై దాడికి దిగితే తాము కూడా తిప్పికొడతామని మావోయిస్టులు పేర్కొన్నారు. ఈ ప్ర‌ట‌క‌న వెలువ‌డిన‌ కొద్దిరోజులకే ఈ ఎన్‌కౌంట‌ర్ జ‌ర‌గ‌డం గమనార్హం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: