లాక్ డౌన్ నిజంగా పోలీసులకు చాలా పెద్ద సవాల్ అనేది వాస్తవం. ప్రజలను కట్టడి చేయడం అనేది అంత సాధారణ విషయం మాత్రం కాదు. ఎవరు ఎటు నుంచి వస్తారో ఎవరు ఎటు వెళ్తారో కూడా అర్ధం చేసుకోవడం కష్టం. నిజంగా ఇది పోలీసులకు పెద్ద సవాల్ అనే చెప్పుకోవాలి. తాజాగా హర్యానాలో కాస్త లాక్ డౌన్ ని సడలించగానే జనాలు పెద్ద ఎత్తున బయటకు వచ్చారు. 

 

పాల్వాల్ వెజిటబుల్ మార్కెట్ వద్ద 2 AM & 6 AM మధ్య షాపులు తెరుచుకోవచ్చని అధికారులు ఆదేశాలు ఇవ్వగా సామాజిక దూరం లేకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు. ఈ సందర్భంగా ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ... కస్టమర్లు సామాజిక దూరాన్ని అనుసరించడం మాకు చాలా సవాలుగా ఉంది. ఏదైనా దుకాణంలో నియమాలు ఉల్లంఘిస్తే, దానిని డ్యూటీ మేజిస్ట్రేట్ మూసివేస్తారని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: