తెలంగాణాలో ఉమ్మడి ప్రవేశ పరిక్షల తేదీని ఉన్నత విద్యా శాఖ ప్రకటించింది. జులై ఆరు నుంచి 9 వరకు తెలంగాణా ఎంసెట్ పరీక్షా ఉంటుందని పేర్కొన్నారు. జులై నాలుగున తెలంగాణా ఈ సెట్, 10 లా సెట్, జులై 13 ఐసెట్, జులై 15 న తెలంగాణా ఎడ్ సెట్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. 

 

లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే విద్యార్ధుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారి భవిష్యత్తు విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టిన తెలంగాణా ప్రభుత్వం విద్యార్ధులు ఎక్కడా కూడా నష్టపోవద్దు అని చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక 10 తరగతి విద్యార్ధుల పరిక్షలకు కూడా హైకోర్ట్ అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వాటి తేదీలను కూడా ఖరారు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: